ఒంగోలులో వీరసింహా రెడ్డి ఈవెంట్కు కారణమిదే
విజయం వచ్చాక అందరూ మెచ్చుకోవడం వేరు. సొంత వాళ్లు మెచ్చుకోవడం వేరు. ప్రపంచమంతా మనల్ని పొగిడినా, పుట్టిన గడ్డ తమ విజయాన్ని మెచ్చుకోవడం ఎంతో స్పెషల్. ఇప్పుడు అదే ఫీలింగ్ను ఎక్స్పీరియన్స్ చేయడం కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని తన వీరసింహారెడ్డి టీమ్ని కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ అంచనాల మధ్య వీరసింహా రెడ్డి తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, పోస్టర్లు సినిమాపై అంచనాలను ఇంకా పెంచేశాయి. పాటలు, టీజర్, బాలయ్య లుక్స్ సినిమాపై పాజిటివ్ బజ్ స్ప్రెడ్ అయ్యేలా చేశాయి. దీంతో బాలయ్య అకౌంట్లో మరో సీమ స్టోరీ హిట్ అంటూ టాక్ స్ప్రెడ్ అవుతోంది.
ఇందులో భాగంగానే సీమ సింహాన్ని ఒంగోలుకు తీసుకెళ్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని జనవరి 6న ఒంగోలులో నిర్వహిస్తున్నారు. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ దర్శకుడు గోపీచంద్ అనే తెలుస్తోంది. తన సొంత ఊరులో ఈ ఈవెంట్ని అక్కడ నిర్వహించాలని గోపీచంద్ పట్టుబట్టి మరీ బాలయ్యని ఒప్పించారట. బాలయ్య ఒప్పుకున్నాక ప్రొడ్యూసర్స్ని కూడా ఒప్పించినట్లు తెలుస్తోంది.
ఇలా ఒంగోలులో ఫిక్స్ చేయడానికి రీజన్ కూడా ఉంది. ఒంగోలు గోపీకి సొంతూరు కావడం, గోపీ బాలయ్యకు పెద్ద ఫ్యాన్ కావడం, తన అభిమానమంతా సినిమాలో చూపిస్తానని ఒకప్పుడు గోపీ అనడం, ఇప్పుడు అదే ఫ్యానిజాన్ని తన సొంత గడ్డపై చూపించాలని ఇలా ఒంగోలులో ఈవెంట్ను ఫిక్స్ చేశారు. ఈ విధంగా ఒంగోలు ఈవెంట్ గోపీచంద్ కెరీర్లో స్పెషల్గా నిలవబోతుంది. గోపీచంద్ గత సక్సెస్లు చూసి బాలయ్య ఛాన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.