కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి... మరోసారి కరోనా
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మళ్లీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంచార్జ్ జైరామ్ రమేశ్ వెల్లడిరచారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ప్రొటోకాల్ ప్రకారం హోం ఐసోలేషన్లో ఉన్నారని వెల్లడించారు. ఇదిలా ఉంటే జూన్లో ఆమె కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కరోనా కారణంగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఆమె ఈడీ ఎదుట హాజరు అయ్యేందుకు గడువు సైతం కోరారు. ఈలోపు కరోనాతో ఇబ్బంది పడ్డ ఆమె గంగారాం ఆస్పత్రిలో చేర్పించారు కూడా.
Tags :