పార్టీ బలోపేతం కోసం కృషి : మాజీ సీఎం
బీజేపీ అధిష్ఠానం ఎక్కడ పనిచేయమంటే అక్కడే పనిచేస్తానని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోమ వీర్రాజు, పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి మధుకర్ కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకున్న అనుభవంతో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు. బీజేపీలో చేరిన తర్వాత నెల రోజులపాటు తాను అమెరికా వెళ్లినట్లు తెలిపారు. సమయం, సందర్బంగా వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ పాలనపై స్పందిస్తానన్నారు.
Tags :