ASBL NSL Infratech

బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎస్‌బీఐ

బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎస్‌బీఐ

ఇల్లు కొనాలనుకునే వారికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 31 వరకూ ప్రాసెసింగ్‌ ఫీజును రద్దు చేసింది. అంతేకాదు ఏడాదికి కనిష్ఠంగా 6.8 శాతం వడ్డీతో హోంలోన్స్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఎస్‌బీఐ వివిధ హోంలోన్లను అందిస్తోంది. అందులో సాధారణ హోంలోన్లతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎస్‌బీఐ ప్రివిలెజ్‌ హోంలోన్‌, ఆర్మీ, రక్షణ రంగ సిబ్బందికి ఎస్‌బీఐ శౌర్య హోంలోన్‌లతో పాటు ఎస్‌బీఐ స్మార్ట్‌హోమ్‌, ఎస్‌బీఐ ఎన్నారై హోంలోన్‌ లాంటివి అందిస్తోంది.

కొత్తగా హోంలోన్‌ కావాలని అనుకునే వాళ్లు 7208933140 నంబర్‌కు మిస్‌ కాల్‌ ఇస్తే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని ఎస్‌బీఐ వెల్లడించింది. అతి తక్కువ వడ్డీరేట్లతో ఇప్పటికే దేశంలో హోంలోన్‌ షేర్‌లో 34 శాతం వాటా ఎస్‌బీఐదే కావడం విశేషం. సగటున రోజుకు వెయ్యి మంది హోంలోన్‌ కస్టమర్లు వస్తున్నట్లు ఆ బ్యాంకు తెలిపింది. హోంలోన్‌ బిజినెస్‌లో ఎస్‌బీఐ ఇప్పటికే రూ.5 లక్షల కోట్ల మార్క్‌ను అందుకోవడం విశేషం. 2024 కల్లా దీనిని రూ.7 లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగానే అతి తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్‌ ఫీజు మాఫీలాంటి ఆఫర్లు ఇస్తోంది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :