చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా బీజేపీ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన వీరికి చంద్రబాబు స్వాగతం పలికారు. నేతలకు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువతో సత్కరించారు. ఉమ్మడి మ్యానిఫెస్టో, మూడు పార్టీల మధ్య సమన్వయం, ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభల గురించి చర్చ జరిగినట్టు సమాచారం. సుమారు రెండు గంటల పాటు భేటీ సాగింది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, జాతీయ సంయుక్త కార్యదర్శి శివ్ప్రకాశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్ పాల్గొన్నారు.
Tags :