ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభం
సంక్షేమ కార్యక్రమాలతో పాటు వినోదాన్ని సైతం ప్రజలు ముంగిటకు తీసుకువెళ్లాలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించామని రాష్ట్ర ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతం రెడ్డి తెలిపారు. విశాఖలోని పార్క్ హోటల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా గౌతం రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం వలన ఎవరికి ఎటువంటి ఇబ్బందీ ఉండదన్నారు. 99 రూపాయలకే సినిమా మొత్తం కుటుంబం చూడవచ్చని తెలిపారు. ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ సినిమా రిలీజ్ అయిన రోజే సినిమాను ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇంట్లోనే చూసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫస్ట్ డే పస్ట్ షో కొత్త కాన్సెప్ట్తో గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ నిర్ణయం వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపారు.