భారత విద్యార్థులకు నాసా అవార్డులు
అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నిర్వహించిన హ్యూమన్ ఎక్న్ ప్లోరేషన్ రోవర్ చాలెంజ్లో రెండు భారత విద్యార్థి బృందాలు సత్తా చాటాయి. ఢిల్లీ- ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన కేఐఈటీ గ్రూప్ విద్యాసంస్థ స్టూడెంట్స్ క్రాష్ అండ్ బర్న్ విభాగంలో అవార్డు సాధించారు. అలాగే ముంబయికి చెందిన ద కనాకియా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు రూకీ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 600 మందికిపైగా విద్యార్థులతో కూడిన 72 టీమ్స్ ఈ వార్షిక పోటీలో పాల్గొనున్నాయి. అలబామా రాష్ట్రంలోని హంట్స్ విల్లేలో ఉన్న అమెరికా అంతరిక్ష రాకెట్ కేంద్రంలో ఏప్రిల్ 19, 20 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి.
Tags :