ASBL NSL Infratech

బాల‌య్య‌కు న‌చ్చ‌ని గోపీ స్టోరీ

బాల‌య్య‌కు న‌చ్చ‌ని గోపీ స్టోరీ

క్రాక్ సినిమాతో టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ లోకి వెళ్లిపోయిన గోపీచంద్ మ‌లినేని ఆ స‌క్సెస్ ఇచ్చిన కిక్‌తో వీర‌సింహారెడ్డి సినిమాను తెర‌కెక్కించాడు. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా, శృతి హాస‌న్ హీరోయిన్ గా, బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేసిన ఈ సినిమాలో వ‌ర‌ల‌క్షీ శ‌ర‌త్ కుమార్, దునియా విజ‌య్ కుమార్ మంచి ప‌వ‌ర్ ఫుల్ రోల్స్ లో క‌నిపించారు. 

ఎన్నో అంచ‌నాల మ‌ధ్య సంక్రాంతి కానుక‌గా రిలీజైన ఈ సినిమా మొద‌టి రోజు నుంచే యావ‌రేజ్ టాక్ తెచ్చుకుంది. టాక్ అయితే యావ‌రేజ్ కానీ క‌లెక్ష‌న్లు మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నాయి. సంక్రాంతి రేసులో ఫ‌స్ట్ ప్లేస్ లో లేక‌పోయినా యావ‌రేజ్ టాక్‌తో సెకండ్ ప్లేస్ లో నిలిచింది ఈ చిత్రం. 

ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఓ మీడియాకు ఇచ్చిన స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూలో గోపీచంద్ ఈ సినిమా గురించి ప‌లు ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు. ముందు బాల‌య్య‌తో సినిమా అనుకున్న‌ప్పుడు చెప్పిన క‌థ బాల‌య్య‌కు పెద్ద‌గా న‌చ్చ‌లేద‌ని, అఖండ త‌ర్వాత త‌ను చేయబోయే సినిమా అంత‌కు మించిలే ఉండాల‌ని బాల‌య్య చెప్పిన‌ట్లు గోపీచంద్ తెలిపాడు. 

అంతే కాదు, గోపీ చెప్పిన స్టోరీ బాగున్న‌ప్ప‌టికీ, త‌న ఫ్యాన్స్ కి అది స‌రిపోద‌ని బాల‌య్య తేల్చి చెప్పాడ‌ట‌. దీంతో ఎప్ప‌టి నుంచో ఉంచుకున్న క‌థ‌ని బాల‌కృష్ణ‌కు వినిపించాడ‌ట గోపీచంద్. లైన్ చెప్ప‌గానే ఈ సినిమా మ‌నం చేస్తున్నామ‌ని, సీమ నేప‌థ్యంలో సినిమా చేసి చాలా రోజుల‌వుతుంది ఇప్పుడు చేస్తే బాగుంటుంది. ఖ‌చ్చితంగా ఈ సినిమానే చేద్దామ‌న్నాడ‌ట బాల‌య్య‌. 

తండ్రీ కొడుకుల క‌థ అన‌గానే పాత్ర సినిమాలు గుర్తొస్తాయ‌ని సిస్ట‌ర్ సెంటిమెంట్ పెట్టిన‌ట్లు ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని స్ప‌ష్టం చేశాడు. మొత్తానికి త‌న‌కు న‌చ్చిన అభిమాన హీరోని, త‌ను ఎప్ప‌టి నుంచో రెడీ గా ఉంచుకున్న క‌థ‌తో చేసి గోపీచంద్ మ‌లినేని విజ‌యం సాధించడం గొప్ప అనే చెప్పుకోవాలి.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :