కెంటుకీ టోర్నాడో బాధితులకు ఆటా 25,000 డాలర్ల విరాళం
టోర్నోడో వల్ల నష్టపోయిన కెంటుకీ వాసులను ఆదుకునేందుకు అమెరికా తెలుగు సంఘం (ఆటా) ముందుకు వచ్చింది. ఆటా అధ్యక్షుడు భువనేష్ బూజాల, జే చల్లా, సన్నీరెడ్డి, కిరణ్ పాశం, సుధీర్ బండారు, రవి చల్లా వాషింగ్టన్డిసిలోని రెడ్క్రాస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అమండా లెపోఫ్, సిటిఓ సాజిత్ జోసెఫ్లకు 25వేల డాలర్ల చెక్కును అందించారు. బాధితులను ఆదుకోవడంలో చొరవ తీసుకున్న సన్నీ రెడ్డిని అందరూ అభినందిస్తూ, కిరణ్ పాశంకు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. దాతలైన భువనేష్ బూజాల, పరశురాం పిన్నపురెడ్డి, సన్నీరెడ్డి, శరత్ వేముల, రఘువీరారెడ్డి, జై చల్లా, కిరణ్ పాశం, సుధీర్ బండారు, రవి చల్లా, విజయ్ తుపల్లి, ఫణి తాళ్లూరి, సామ్ ముక్కు అందరికీ ఆటా నాయకత్వం ధన్యవాదాలను తెలియజేసింది.
Tags :