మహేష్ నో అంటే బన్నీ ఓకే అన్నాడా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థలపై భూషణ్ కుమార్ కృష్ణ కుమార్ ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి సందీప్ ఫ్యాన్స్తో పాటూ బన్నీ ఫ్యాన్స్ కూడా తెగ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తెలుస్తాయా అని వెయిట్ చేస్తున్నారు.
రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటి అంటే ఈ సినిమాలో హీరోగా మొదట మహేష్ బాబును అనుకున్నాడట సందీప్ రెడ్డి. ఈ క్రమంలోనే స్టోరీ రెడీ చేసుకుని మహేష్ కు చెప్పగా, ఈయన నో చెప్పారట. ఆ స్టోరీకి మహేష్ నో చెప్పగా, అప్పుడు కథ బన్నీ దగ్గరకు వెళ్లి చెప్పారట. బన్నీకి కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవాళే వచ్చింది.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 సినిమా చేస్తున్న బన్నీ, ఈ షూటింగ్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈసినిమాను నిర్మిస్తోంది. ఈ సీక్వెల్ ప్రాజెక్టుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. పుష్ప2 షూటింగ్ పూర్తి కాగానే బన్నీ, సందీప్ రెడ్డి వంగా సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాతో పాటు బన్నీ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్ మెంట్ అయితే రాలేదు కానీ బన్నీ పుష్ప2 సినిమా తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు చేయనున్నాడు. ఈ రెండిటిలో ముందు బన్నీ దేన్ని ముందు పట్టాలెక్కిస్తాడో తెలియాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సింది.