బాలీవుడ్ ఎంట్రీ కోసం ట్రై చేస్తున్న వంశీ పైడిపల్లి
నేషనల్ లెవల్ లో క్రేజ్, ఫాలోయింగ్ రావడం కోసం హీరోలే కాదు డైరెక్టర్లు కూడా బాలీవుడ్ సినిమాలు చేయాలని తాపత్రయ పడుతున్నారు. సందీప్ రెడ్డి వంగాకు యానిమల్ సినిమా అవకాశమొచ్చిందంటే దానిక్కారణం కబీర్ సింగ్ రీమేక్ చేయడమే. ఇదే దారిలో గౌతమ్ తిన్ననూరి కూడా జెర్సీని రీమేక్ చేశాడు కానీ ఫలితం మాత్రం లేకుండా పోయింది.
హిట్ ఫస్ట్ కేస్ ను బాలీవుడ్ లో రీమేక్ చేద్దామని శైలేష్ కొలను చేసిన ప్రయత్నమైతే బెడిసి కొట్టింది. ఇక ఇప్పుడు బేబీ లాంటి హిట్ మూవీ తీసిన సాయి రాజేష్ కొత్త కథలు పక్కన పెట్టి మరీ హిందీ రీమేక్ పనుల్లో బిజీ అయిపోయాడు. మైత్రీ మూఈ మేకర్స్ బ్యానర్ లో గోపీచంద్ మలినేని సన్నీ డియోల్ తో ఓ సినిమా చేయబోతున్నాడు.
ఇప్పుడు తాజాగా వంశీ పైడిపల్లి కూడా బాలీవుడ్ హీరోతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కు వంశీ ఓ లైన్ చెప్పి ఓకే చేయించుకున్నాడని తెలుస్తోంది. తలపతి విజయ్ తో వారసుడు సినిమా చేశాక వంశీకి ఆఫర్లేమీ రాలేదు. దీంతో తనకు మున్నా నుంచి చేయూతనిస్తున్న దిల్ రాజు నిర్మాతగా ఈ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లు అప్డేట్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.