పదవులు, వ్యాపారాల కోసం వచ్చినవారే పార్టీ మారుతున్నారు.. పోచారం..
ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రా తో పాటు తెలంగాణలో కూడా పార్టీ మార్పులు జరుగుతున్నాయి. పలువురు ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బయటకు వెళ్తున్న నేతల పై మాజీ స్పీకర్,బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించారు. అవసరంలో అండగా నిలిచిన పార్టీని వదిలిపోయే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని పోచారం అన్నారు. అంతేకాదు కొంతమంది వెళ్లడం వల్ల తమ పార్టీ నుంచి చెత్త అంతా బయటకు పోయింది అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పార్టీలో గట్టి వాళ్లు మాత్రమే మిగిలారన్న పోచారం.. పదవులు, వ్యాపారాల కోసం వచ్చిన వారు మాత్రమే పార్టీలు మారుతారని ఆయన విమర్శించారు. మొదటినుంచి గులాబీ జెండాను మోసిన నాయకులు మాత్రమే ఇప్పుడు పార్టీలో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బండ్లు ఓడలు, ఓడలు బండ్లవుతాయని.. ఎవరు పార్టీని వదిలిపోయిన వచ్చిన నష్టం ఏమీ లేదు అని అన్నారు.