వైట్ల సినిమాకు పీపుల్ మీడియా సాయం
డైరెక్టర్, హీరో మంచి ఫామ్ లో ఉండి, వాళ్ల సినిమాలకు ఎలాంటి బడ్జెట్ ఇష్యూస్ వచ్చినా ఏదోలా ఫైనాన్స్ సర్దుబాటు అయిపోతుంటుంది. కానీ అలా కాకుండా ఫేడవుట్ అయిన కాంబో అయితే ఆ సినిమాకు బడ్జెట్ సమస్యలు వస్తే అవి అసలు తీరవు. కొన్ని సినిమాలైతే ఆగిపోతుంటాయి కూడా. మరికొన్ని అతి కష్టం మీద ముందుకెళ్తుంటాయి.
ఇప్పుడు శ్రీనువైట్ల, గోపీచంద్ కాంబోలో వస్తున్న సినిమా పరిస్థితి కూడా అంతే. కొన్ని నెలల కిందటే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కానీ బడ్జెట్ ప్రాబ్లమ్ వల్ల ఈ సినిమాకు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ సినిమా నిర్మాణ సంస్థ చిత్రాలయ స్టూడియోస్ కు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండగా నిలవడంతో ఇటీవలే కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టుకుంది.
గత కొన్నేళ్లుగా గోపీచంద్ కు సరైన హిట్ లేదు. శ్రీను వైట్ల కు కూడా అమర్ అక్బర్ ఆంటోనీ డిజాస్టర్ ఫలితాన్నిచ్చింది. ఆ తర్వాత మంచు విష్ణు తో ఢీ సీక్వెల్ ను ప్లాన్ చేశారు కానీ అది మొదలవకుండానే ఆగి పోగియింది. రీజైన్ ఏదైనా సరే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. తర్వాత వైట్ల స్క్రిప్ట్ గోపీచంద్ కు నచ్చడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. ఇప్పుడు ఆ సినిమాకు కూడా బడ్జెట్ ఇష్యూస్. మొత్తానికి అన్ని సమస్యలు తీరిపోయి ఇప్పుడు సినిమా రీస్టార్ట్ అయింది. ఎలాగైనా గోపీచంద్ సినిమాతో వైట్ల తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇక తర్వాతి ఛాన్స్ ఆశలు వదులుకోవాల్సిందే.