ASBL NSL Infratech

బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను పంపారు..జగన్..

బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను పంపారు..జగన్..

ఈరోజు జగన్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో జరిగిన బహిరంగ సభలో జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు వివేకా హత్య కేసు గురించి షర్మిల, సునీత ఎన్ని మాట్లాడినా పెద్దగా స్పందించని జగన్ మొదటిసారి తన మనసులోని మాటలు బయటపెట్టారు. తన తండ్రిపై, తనపై లేనిపోని నిందలు వేసి దెబ్బతీయడం కోసం చంద్రబాబు, దత్తపుత్రుడు.. షర్మిల తో కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగా వైఎస్సార్‌ కుటుంబం పై బురద చల్లడానికి తన ఇద్దరి చెల్లెలని ఎవరు పంపించారో అందరికీ తెలుసు అని అన్నారు. అంతేకాదు తన చిన్నాన్న వివేకాను అన్యాయంగా ఎన్నికల్లో ఓడించి వాళ్లను తన ఇద్దరు చెల్లెళ్ళు సమర్థించడం చాలా బాధాకరంగా ఉంది అని అన్నారు. వాళ్ళు చెప్పింది వింటూ.. ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్న వీళ్లా వైఎస్సార్‌ వారసులు? అని ప్రశ్నించారు. వివేకా హత్యకు అవినాష్ కు సంబంధం లేదు అని గట్టిగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చాను అని జగన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వివేకా రెండవ భార్యా, బిడ్డ గురించి కూడా జగన్ ప్రస్తావించారు. ఈరోజు తనకు మద్దతుగా వచ్చిన ప్రజలను చూస్తే ఆనందంగా ఉందని.. తనకు ఎప్పుడు ఇస్తున్నట్లుగానే రేపు ఎన్నికల్లో కూడా మద్దతు ఇవ్వాలని కోరుకున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :