జగన్ కు చంద్రబాబు సవాల్..
ఎలక్షన్స్ నేపథ్యంలో జోరుగా ప్రచారాలు సాగిస్తూ ముందుకు నడుస్తున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు జరిగిన ప్రజాగళం సభ నేపథ్యం లో ఆయన జగన్ కు ఓ సవాలు విసిరారు. మాట్లాడితే తన వయసు గురించి ప్రస్తావించే జగన్ తన లాగా మండుటెండలో వరుసగా మూడు మీటింగులలో పాల్గొని సాయంత్రానికి తన కాళ్ళ మీద తాను నిలబడగలడా అని చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబు ఏం చేశాడు అని ప్రశ్నించే జగన్ తెలుగు రాష్ట్రంలో పిల్లలను అడిగిన తాను చేసిన ప్రగతి గురించి చెబుతారు అని అన్నారు. అంతేకాకుండా తను చేసిన వాటి గురించి జగన్ తెలుసుకోకపోవడం అతని అజ్ఞానమని.. దానికి తానేమీ చేయలేనని చంద్రబాబు ట్విట్ చేశారు. బనగానపల్లెలో జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోని కూడా షేర్ చేశారు. ఇందులో జగన్ ని చంద్రబాబు పిల్ల కాకితో పోల్చారు. జగన్ పెద్ద పని దొంగ అంటూ ఘాటుగా విమర్శించారు. ఇక దీనిపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
నా వయసు గురించి మాట్లాడతాడు జగన్. నా మాదిరిగా మండుటెండలో ఒక మూడు మీటింగుల్లో పాల్గొని సాయంత్రానికి తన కాళ్ళ మీద తాను నిలబడగలడా ఈ జగన్? చంద్రబాబు ప్రజలకు ఏం చేసాడని అడుగుతాడు. తెలుగు రాష్ట్రాల్లో పిల్లలని అడిగినా చెప్తారు నేను ఏం చేసానో. అతనికి తెలియకపోతే ఆ అజ్ఞానానికి ఎవరేం… pic.twitter.com/Iriz1Ki3vg
— N Chandrababu Naidu (@ncbn) March 29, 2024