ASBL NSL Infratech

మార్ఫింగ్ వీడియో పై తీవ్రంగా స్పందించిన బీజేపీ..

మార్ఫింగ్ వీడియో పై తీవ్రంగా స్పందించిన బీజేపీ..

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఒక్కసారి పెద్ద దుమారం రేగింది. అయితే ఇది నిజమైన వీడియో కాదు.. డీప్ మార్ఫింగ్ చేసి ఈ వీడియోని సోషల్ మీడియాలో కావాలని ఎవరో వైరల్ చేశారు. తమ పార్టీ ప్రతిష్టను భంగపరిచే విధంగా ఉన్న ఈ వీడియో పై స్పందించిన బీజేపీ పోలీస్ కేసు నమోదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా బీజేపీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అమిత్ షా మాట్లాడిన అసలు వీడియోని షేర్ చేసింది. తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న రిజర్వేషన్లు మాత్రమే రద్దు చేస్తామని అమిత్ షా ఈ వీడియోలో స్పష్టంగా చెప్పారు. అయితే దాన్ని ఎడిట్ చేసి ఎవరో కావాలని వైరల్ చేశారని.. అందులో తమ పార్టీ ప్రతిష్టను భంగపరచడానికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఎత్తివేస్తామని అమిత్ షా చెప్పినట్లు సృష్టించారని పేర్కొంది. దీని వెనక ఎవరు ఉన్నారు అన్న విషయం పోలీసు దర్యాప్తులో త్వరలోనే బయటపడుతుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :