రాహుల్ గాంధీ అనర్హత వేటుపై... అమెరికా స్పందన ఇదే
పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై లోక్సభ సెక్రటేరియట్ ఎంపీగా అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా ఈ అంశంపై తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. భారత్ కోర్టులో రాహుల్ గాంధీ కేసును తాము చూస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్పర్సన్ వేదాంత్ పటేల్ తెలిపారు. అయితే ప్రజా స్వామ్యి విలువలను బలోపేతం చేసే అంశంలో భారత్తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడిరచారు. చట్ట నిబంధనలను గౌరవించడం, న్యాయ స్వతంత్రత ఏ ప్రజాస్వామ్యానికైనా మూల వ్యక్తీకరణ స్వేచ్ఛతో పాటు ప్రజాస్వామ్య విలువలపై భారత ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు నిబద్ధతతో ఉన్నాం అని ఆయన పేర్కొన్నారు.
Tags :