ASBL NSL Infratech

శ్రీవారి సేవలో ఉప రాష్ట్రపతి

శ్రీవారి సేవలో ఉప రాష్ట్రపతి

భారత ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న ఉప రాష్ట్రపతికి టీటీడీ ఏవీ ధర్మారెడ్డి సాదరంగా ఆహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్‌ స్వాగతం పలికింది. ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం ఉప రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఉప రాష్ట్రపతికి వేదా శీర్వచనం చేశారు. ఈవో శ్రీవారి శేషవస్త్రాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఉప రాష్ట్రపతి మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తిరుమల క్షేత్రం ప్రాచీన భారతీయ సంస్కృతి, నాగరికతలో మహోన్నతమైనదని అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :