రిలయన్స్ ఇండస్ట్రీస్ తో డిస్నీ ఒప్పందం!
భారత్లో తమ మీడియా కార్యకలాపాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)తో విలీనం చేసేందుకు ఒప్పందాన్ని (నాన్ -బైండింగ్ టర్మ్ షీట్) అమెరికా దిగ్గజ సంస్థ వాల్ట్ డిస్నీ కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విలీన సంస్థలో 51 శాతం వాటాను షేర్లు, నగదు కలయికలో రిలయన్స్ దక్కించుకుంటుందని, మిగతా 49 శాతం వాటా డిస్నీ వద్ద ఉంటుందని సమాచారం. అంటే ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్నకు విలీన సంస్థలో నియంత్రణ వాటాను డిస్నీ అందిస్తోంది. ఫిబ్రవరి నాటికి ఈ ఒప్పందం పూర్తయ్యే అశకాశం ఉందని తెలుస్తోంది. రిలయన్స్ మాత్రం జనవరి ఆఖరుకు నియంత్రణ సంస్థల అనుమతులతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. ఈ ఒప్పందం పూర్తయితే మీడియా, వినోద రంగంలో అతి పెద్ద విలీనం ఇదే అవుతుంది. 100కు పైగా ఛానెళ్లు, రెండు దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్లతో అతి పెద్ద సంస్థగా ఆవిర్భవిస్తుంది.