నిర్మాతల మండలి అధ్యక్షుడిగా గెలుపొందిన దామోదర్ ప్రసాద్
నూతన కార్యవర్గ సభ సమావేశంలో అందరు ఒకటే అను నినాదంతో అలాగే అందరం కలిసి కౌన్సిల్ అభివృధికి పాటుపడతాం అని నిర్ణయంతీసుకోని అందరి సభ్యుల మనవి అంగీకరించి జైత్రవంతంగా కౌన్సిల్ ఎన్నికలను, సభ సమావేశం పూర్తిచేశారు..
ఈ సభలో ఎన్నికలలో హామీలను దృష్ఠి లో పెట్టుకొని మెంబర్లు కోసం హోసింగు విషయము పేద నిర్మాతల పిల్లల విధ్య, వివాహం, మరియు గిల్డని కౌన్సిల్లో విలీనం చేయడానికి, బైలా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు ..
నూతన కార్యవర్గ సభ్యులు: త్వరలో మిగితా విషయాలు వెల్లడిస్తాం .అని తెలిపారు.
నిర్మాతల మండలి ప్రెసిడెంట్ గా దామోదర ప్రసాద్ గెలుపు
ఉపాధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన సుప్రియ అశోక్
ట్రెజరర్ గా రామ సత్యన్నారాయణ గెలుపు, హనరబుల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ గెలుపు
YVS చౌదరి..గెలుపు, జాయింట్ సెక్రెటరీ గా భారత్ చౌదరి గెలుపు, నట్టి కుమార్ గెలుపు
EC మెంబర్స్ గా గెలుపొందిన వారు దిల్ రాజు, దానయ్య, రవి కిషోర్, యలమంచిలి రవి, పద్మిని, బెక్కం వేణుగోపాల్, సురేందర్ రెడ్డి, గోపీనాథ్ ఆచంట, మధుసూదన్ రెడ్డి, కేశవరావు, శ్రీనివాద్ వజ్జ, అభిషేక్ అగర్వాల్, కృష్ణ తోట, రామకృష్ణ గౌడ్, కిషోర్ పూసలు.