మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం... 22 నెలల తర్వాత ఆ ఎస్పీపై వేటు
పంజాబ్లో రెండేళ్ల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బఠిండా జిల్లా ఎస్పీ గుర్బీందర్ సింగ్ పై వేటు పడింది. ఈ మేరకు ఆయనను తక్షణమే విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తూ పంజాబ్ హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఘటన సమయంలో ఆయన ఫిరోజ్పూర్ ఎస్పీగా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఇటీవల రాష్ట్ర డీజీపీ హోంశాఖకు నివేదిక సమర్పించారు. ప్రధాని పర్యటన సమయంలో ఫిరోజ్పుర్లో విధుల్లో ఉన్న గుర్బీందర్ సింగ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని తమ దర్యాప్తులో డీజీపీ వెల్లడిరచారు. ఈ నివేదిక పరిశీలించిన అనంతరం సింగ్ను సస్పెండ్ చేస్తున్నట్లు హోంశాఖ తమ ఉత్తర్వుల్లో పేర్కొంది.
Tags :