ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రాజస్థాన్ యువతికి మిస్ ఇండియా కిరీటం

రాజస్థాన్ యువతికి మిస్ ఇండియా కిరీటం

రాజస్థాన్‌కు చెందిన నందిని గుప్తా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2023 కిరీటాన్ని గెలుచుకుంది. కోట జిల్లాకు చెందిన 19 ఏళ్ల నందిని ఇంఫాల్‌ జరిగిన గ్రాండ్‌ ఫినాలె ఈవెంట్‌లో విజేతగా నిలిచింది. ఢిల్లీకి చెందిన షెరియా పూంజా మిస్‌ ఇండియా 2023 మొదటి రన్నరప్‌గా నిలిచింది. మణిపూర్‌కి చెందిన తౌనోజం స్ట్రెలా లువాంగ్‌ 2వ రన్నరప్‌గా ప్రకటించబడిరది. ఫెమీనా మిస్‌ ఇండియా యూనివర్స్‌ 2022 విజేత, మెంటర్‌ నేహా దూపియా, బాక్సింగ్‌ ఐకాన్‌ లైష్రామ్‌ సరితాదేవి, ఏస్‌ కొరియో గ్రాఫర్‌ బెరెన్స్‌, లూయిస్‌, చిత్ర దర్శకుడు హర్షవర్దన్‌ కులకర్ణి, ఫ్యాషన్‌ డిజైనర్లు రాకీస్టార్‌, నమ్రతా జోషిపురాతో కూడిన ప్యానెల్‌ విజేతలకు ఎంపిక చేసింది. ఈవెంట్‌లో మాజీ విజేతలు సినీశెట్టి, రూబల్‌ షెకావత్‌, షినతా చౌహాన్‌, మానస వారణాసి, మణికా షియోకంద్‌, మాన్యసిగ్‌, సుమన్‌రావ్‌, శివాని జాదవ్‌ ముచ్చటైన లెహంగాలు ధరించి ప్రదర్శనలు ఇచ్చారు. మునీష్‌పాల్‌, భూమి పెడ్నేకర్‌ హోస్ట్‌ చేసిన ఈవెంట్‌ 59వ ఎడిషన్‌ బాలీవుడ్‌ నటులు కార్తీక ఆర్యన్‌, అనన్యపాండేకు కూడా అలరించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :