ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ.. సంపద ఎంతో తెలుసా?
ప్రపంచ కుబేరుల గురించి ప్రపంచానికి తెలుసు. అత్యత ధనిక ఖైదీ గురించి మాత్రం మొదటిసారి వింటున్నారు. క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. మనీలాండరింగ్ నిరోధక, ఆంక్షల చట్టాలను ఉల్లంఘించిన కేసులో చాంగ్ జావోను గత సంవత్సరం అమెరికా కోర్టు దోషిగా తేల్చింది. ఆయను మూడు సంవత్సరాల జైలు శిక్షను విధించాలని న్యాయవాదులు కోరినప్పటికీ, జావో ప్రవర్తనను పరిగణన లోకి తీసుకున్న కోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. చాంగోజావో 2017లో బినాన్స్ సంస్థను స్థాపించారు. దీంతో కొన్ని సంవత్సరాల్లోనే బిలియనీర్గా ఎదిగారు. ఈ సంస్థ క్రిప్టో ఎక్స్ఛేంజ్లను నడుపుతూ ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది. అమరికా అధికారులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం గత సంవత్సరం జావో బినాన్స్ సీఈవో బాధ్యతల నుంచి వైదొలగారు. అయినప్పటికీ ఆయనకు సంస్థలో 90 శాతం వాటా ఉంది. జావో సంపద విలువ 43 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో సుమారు 3.60 లక్షల కోట్లు. ప్రపంచ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ తగ్గడంతో సంస్థ నష్టాలను ఎదుర్కొంది. ఈ క్రమంలోనే జావో చట్టాలను ఉల్లంఘించినట్లు వెలుగులోకి వచ్చింది.