తిరుమల శ్రీవారికి భారీగా విరాళం
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. చెన్నైకి చెందిన సుబీనా బాను, అబ్దుల్ ఘనీ దంపతులు శ్రీవారి ఆలయానికి రూ.1.02 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తం విరాళంలో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.15 లక్షలు, ఇటీవల ఆధునికరించిన శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో నూతన పర్నిచర్, వంటశాలలో పాత్రల కోసం రూ.87 లక్షలు అందజేశారు. శ్రీవారి ఆలంయaలోని రంగనాయకుల మండపంలో ఈవో ధర్మారెడ్డికికి దాతలు తమ విరాళం చెక్కును అందజేశారు.
Tags :