కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్క్రెడిబుల్ ఐఎన్సీ లీడర్ షిప్ అవార్డు
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ఇన్క్రెడిబుల్ ఐఎన్సీ లీడర్ షిప్ అవార్డును అందుకున్నారు. భారత్-అమెరికాల మద్య వాణిజ్యం, వ్యాపారం, పీపుల్ టు పీపుల్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాలు నిర్వహించే యూఎస్ ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్ ఈ అవార్డును కేంద్ర మంత్రికి అందజేసింది. భారతదేశపు ఘనమైన సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు పర్యాటకాభివృద్ధికి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చేసిన కృషికి అమెరికాలోని మేరీలాండ్ స్టేట్ నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు ఈ అవార్డును ఆయనకు అందజేవారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి స్పందిస్తూ ఈ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశంలో ఘనమైన చరిత్రను, సంస్కృతిని కాపాడటంతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డు దక్కిందన్నారు.