దిశానిర్దేశం లేని పార్టీలో కొనసాగలేను.. గౌరవ్ వల్లభ్
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. దిశా నిర్దేశం లేని పార్టీలో పని చేయలేనని చెప్పిన అతను ప్రాథమిక సభ్యత్వంతో సహా నిర్వహిస్తున్న అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు గౌరవ్ వల్లభ్ లేఖ రాశారు. తాను పార్టీ రాజీనామా చేయడానికి గల కారణాలను ఈ లేఖలో ఆయన పేర్కొన్నారు. అంతేకాదు దేశంలో సంపద సృష్టికర్తలను విమర్శించడం తన వల్ల కాదని.. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేనని ఆ లేఖలో పేర్కొన్నారు. అందుకే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ట్విట్టర్ వేదికదా గౌరవ్ వల్లభ్ తెలియపరచారు. ప్రస్తుతం గౌరవ్ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tags :