ఆస్ట్రేలియాలో విషాదం .. నలుగురు భారతీయులు
ఆస్ట్రేలియాలో నలుగురు భారతీయులు దుర్మరణం చెందారు. విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్ కు చెందిన బీచ్ వద్ద వారంత నీటి మునిగి మరణించారు. 20 ఏళ్లలో ఆ ప్రాంతంలో ఈ తరహా విషాదం చోటు చేసుకోవడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. ఫిలిప్ ఐలాండ్ బీచ్ సమీపంలో వారిని గుర్తించిన స్బింది కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అక్కడే ముగ్గురు మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు. వీరు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారిగా తెలుస్తోంది.
Tags :