ASBL NSL Infratech

తాజ్‌మ‌హ‌ల్‌కు బెదిరింపులు.. భ‌ద్ర‌త పెంపు

తాజ్‌మ‌హ‌ల్‌కు బెదిరింపులు.. భ‌ద్ర‌త పెంపు

ప్రేమసౌధం తాజ్‌మహాల్‌ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న ఈ పాలరాతి కట్టడాన్ని పేల్చి వేస్తామంటూ బెదిరింపులు రావడంతో అక్కడ భద్రతను పెంచారు. ఇవాళ ప్రత్యేక దళాలు ఆ మాన్యుమెంట్‌ చుట్టూ పహారా కాశాయి. ఉగ్రవాదులు తాజ్‌మహల్‌ను టార్గెట్‌ చేసినట్లు ఓ వెబ్‌సైట్‌లో వార్త రావడంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి ఏడాది సుమారు 60 లక్షల మంది పర్యాటకులు తాజ్‌మహల్‌ను చూసేందుకు వస్తుంటారు. ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించామని, తాజ్‌మహల్‌ టూరిస్టులపైనా కూడా ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎస్పీ ప్రీతిందర్‌ సింగ్‌ చెప్పారు. సాధారణంగా తాజ్‌మహల్‌లో సీఐఎస్‌ఎఫ్‌ దళాలు పహారా కాస్తుంటాయి. ఆ కట్టడం బయట యూపీ పోలీసులు భదత్రా నిర్వహణ చూస్తుంటారు. వాంటేజ్‌ పాయింట్ల వద్ద స్వాట్‌ కమాండోలు ఉంటారు. ప్రతిరోజు సంసిద్ధంగా ఉన్నామని రుజువు చేసేందుకు మాక్‌ డ్రిల్స్‌ చేస్తూనే ఉంటారు.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :