రూ.11 కోట్లు పలికిన రవివర్మ 'దమయంతి'
రవివర్మ గీసిన ఓ చిత్రాన్ని వేలం వేయగా రూ.1109 కోట్లు పలికింది. న్యూయార్క్లోని సోథిబే ఆక్షన్ హౌస్లో దక్షిణాసియాకు చెందిన ఆధునిక, సమకాలీన కళల చిత్రపటాలు వేలానికి ఉంచారు. ఇందులో ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన దమయంతి చిత్రంపటం రూ.11.09 కోట్లు పలికింది. ఈ చిత్తరువుకు దాదాపు రూ.4.58 కోట్లు వస్తాయని నిర్వాహకులు అభిప్రాయపడ్డారట. కానీ వూహించని విధంగా రెట్టింపు ధర పలికిందని వారు చెబుతున్నారు. నల దమయంతి నాటకంలోని ఓ సన్నివేశాన్ని తీసుకుని రవివర్మ ఈ దమయంతి చిత్రపటాన్ని గీశారు. 20వ శతాబ్దానికి చెందిన రవివర్మను 1979లో భారత ప్రభుత్వం జాతీయ నిధిగా అభివర్ణించింది.
Tags :