గవర్నర్తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన సతీమణి వైఎస్ భారతితో కలిసి రాజ్భవన్కు వెళ్లి గవర్నర్తో ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. గవర్నర్కు వైఎస్ జగన్, భారతి దంపతులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాగా, బుధవారం సాయంత్రం గవర్నర్కు ఫోన్ ద్వారా విషెస్ తెలిపిన సీఎం జగన్, కొత్త ఏడాది అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు.
Tags :