బన్నీ అభిమానులకు శుభవార్త
అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత ఆయన కొత్త ప్రాజెక్టు ఖరారైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. 2019 జనవరిలో ఈ సినిమా షూటింగ్ ఆరంభం కాబోతోంది. ఈ మేరకు చిత్ర బృందం తాజాగా ప్రకటన విడుదల చేసింది. బన్నీ 19వ సినిమాగా ఇది రూపుదిద్దుకోబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని నిర్మాతలు తెలిపారు. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. అందరికీ చిత్ర బృందం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.
Tags :