అట్లాంటా తెలుగు మహాసభల సన్నాహక సదస్సు
ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సును అట్లాంటా లో నిర్వహించారు. కార్యక్రమంలో మహెష్ బిగాల మాట్లాదుతూ కేసీఆర్కు తెలుగుపై ఉన్న మమకారం గురించి వివరించారు. తెలుగు భాషను, పండితులను గౌరవించుకోవల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రముఖ సంస్కృతాంధ్రపండితులు బాబు దేవీదాస్ శర్మ, సురేష్ కొలిచాల, ఫణి డొక్కా తదితరులు ప్రసంగించారు. తెలుగు జాతి సాహితీ వైభవాన్ని ప్రపంచమంతా చాటేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను తెలుగు భాషాభిమానులను ఆహ్వానిస్తున్నట్లు అందరూ రావాలని మహేష్ బీగాల కోరారు.
Tags :