ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆటా కాన్ఫరెన్స్ లో శ్రీనివాస కళ్యాణం

ఆటా కాన్ఫరెన్స్ లో శ్రీనివాస కళ్యాణం

అమెరికా తెలుగు సంఘం (ఆటా) వాషింగ్టన్‌ డీసీలో నిర్వహిస్తున్న ఆటా మహాసభల్లో భాగంగా జూలై 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంను నిర్వహిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో అందరూ పాల్గొనాలని కోరుతోంది. ఈ కళ్యాణ మహోత్సవం కోసం తిరుమల నుంచి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి విగ్రహాలను ఇక్కడికి తీసుకువస్తున్నారు. టీటీడి నుండి వచ్చిన వేదపండితులు, అర్చకులు, తిరుమలలో జరిగే విధంగా శాస్త్రోక్తంగా మంత్రోచ్ఛారణల మధ్య ఈ శ్రీనివాస కళ్యాణాన్ని చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడి ధర్మకర్తల మండలి చైర్మన్‌ ఎస్‌.వి. సుబ్బారెడ్డి, ఇతర అధికారులు పాల్గొంటున్నారు. భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని టీటీడివారు తిరుమల నుంచి తీసుకువచ్చిన లడ్డు ప్రసాదాలను స్వీకరించాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు. కార్యక్రమంలో భాగంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి శోభారాజు సంగీత కచేరి కూడా జరుగుతుంది. కళ్యాణ స్వర సందేశం పేరుతో ఆమె ఈ కచేరిని చేయనున్నారు. నీహార్‌ బృందం వారిచే అన్నమయ్య, రామదాసు కీర్తనల ఆలాపన కూడా ఏర్పాటు చేసినట్లు కమిటీ చైర్‌ శ్రీనివాస్‌ నది, శ్రీకాంత్‌ చల్లా తెలిపారు.

 

Tags :