ASBL NSL Infratech

ఘనంగా రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ శోభయాత్ర

ఘనంగా రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ శోభయాత్ర

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా జీయర్‌ ఆస్పత్రి నుంచి యాగశాల వరకు శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ శోభయాత్రలో త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామితో పాటు పలువురు స్వామీజీలు, వేలాది మంది వాలంటీర్లు పాల్గొన్నారు. శోభయాత్ర పూర్తియిన అనంతరం వాస్తు శాంతి, రుత్విక వరణ కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్ర 5 గంటలకు సహస్రాబ్ది ఉత్సవాలకు అంకుర్పారణ జరిగింది. ఉత్సవాలలో అత్యంత కీలకమైన హోమాలు ప్రారంభం కానున్నాయి.

అనంతరం అరణి మథనం, అగ్ని ప్రతిష్ట జరుగుతాయి. సమతా స్ఫూర్తి కేంద్రంలో నేటి నుంచి 14 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. 12 రోజుల పాటు చిన్న జీయర్‌ స్వామి పర్యవేక్షణలో కొనసాగనుంది. ఉత్సవాలలో భాగంగా భారీ ఎత్తున లక్ష్మీనారాయణ మహాయజ్ఞం  కొనసాగనుంది. 108 దివ్వదేశాల ప్రతిష్ఠ కుంభాభిషేకం, స్వర్ణమయ రామానుజ ప్రతిష్ట, సమతామూర్తి లోకార్పణ జరగనుంది. ఈ ఉత్సవాలకు ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోదీ, 7న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, 8న హోంమంత్రి అమిత్‌ షా, 13న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరు కానున్నారు. ఉత్సవాల నేపథ్యంలో ముచ్చింతల్‌లో పెద్ద ఎత్తున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

Click here for Event Gallery

Tags :