ASBL NSL Infratech

రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

సమతా సూత్రాన్ని లోకానికి అందించిన మహానుభావుడు రామానుజాచార్యుల సహస్త్రాబ్ది సమారోహంలో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. హైదరాబాద్‌ శివారులో ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం ఇచ్చారు. పంచలోహాలతో రూపొంది, కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద విగ్రహంగా గుర్తింపు పొందింది. సమతామూర్తి విగ్రహం చుట్టూ 108 ఆలయాల నిర్మాణం చేపట్టారు. సమతామూర్తి కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఎల్‌ఈడీ దీపాల కాంతుల్లో కేంద్రం, యాగశాలలు శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. ప్రత్యేకంగా బెంగళూరుతో పాటు విదేశాల నుంచి తెప్పించిన వందకు పైగా రకాల పుష్పాలతో కేంద్రాన్ని అందంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి,  చినజీయర్‌ స్వామి, మైం హోం గ్రూప్స్‌ అధినేత జూపల్లి రామేశ్వర్‌ రావుతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Click here for Photogallery

 

Tags :