తిరుపతి టీడీపీ ఎంపీ అభ్యర్థి ఖరారు
తెలుగుదేశం పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీ పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నెల్లూరు సభలో చంద్రబాబు సమక్షంలో పనబాక లక్ష్మీ దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం ఆమె పేరును తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆదాల పక్క పార్టీతో లాలూచీ పడారని ధ్వజమెత్తారు. ప్రభాకర్రెడ్డిని చూస్తే అసహ్యం వేస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
Tags :