ASBL NSL Infratech

పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు: లోకేష్

పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు: లోకేష్

దావోస్‌ : పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా కొత్త పాలసీలు తీసుకువచ్చామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ప్రపంచ ఆర్ధిక సదస్సులో భాగంగా బుధవారం ఇన్వెస్ట్‌ ఇండియా లాంజ్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు కొత్త పాలసీలు తెచ్చాము, రాయితీలు కల్పిస్తున్నాము - ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెం.1గా ఉన్నామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు త్వరితగతిన అన్ని అనుమతులు ఇస్తున్నామని, ఏపీలో ఉన్న సానుకూల పరిస్థితులతో అనేక కంపెనీలు వస్తున్నాయి, క్లస్టర్‌ మోడల్‌ అమలుతో పారిశ్రామిక, తయారీరంగాలు అబివృద్ధి చెందుతున్నాయని మంత్రి లోకేష్‌ వివరించారు.

Click here for Photogallery

Tags :