టెక్సాస్ గవర్నర్ ను కలిసిన నారా లోకేష్
అమెరికా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడం కోసం వివిధ వర్గాలను కలుసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, తెలుగు దేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ మే 11వ తేదీన టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంద్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ పథకాలతోపాటు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులను నారా లోకేష్ ఆయనకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ సహజవనరుల, మానవ వనరులు పుష్కలంగా ఉన్న రాష్ట్రమని చెప్పారు.
Tags :