ASBL NSL Infratech

దావోస్‌లో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

దావోస్‌లో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

దావోస్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. దీనికి తెలంగాణ ఏ వరల్డ్‌ ఆఫ్‌ ఆపర్చునిటీస్‌ అని పేరు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వినూత్న పథకాలు, పెట్టుబడులకు ఇస్తున్న ప్రోత్సాహం, తెలంగాణ సాధించిన విజయాలను ఈ పెవిలియన్‌లో ప్రదర్శించారు. హైదరాబాద్‌ నగరం విశిష్ఠతను వివరిస్తూ, ఇటీవల వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డును గెలుచుకున్నదని గుర్తు చేశారు. సమావేశానికి వచ్చే వారికి తెలంగాణ ఖ్యాతిని వివరిస్తూ, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పెవిలియన్‌ ఉపయోగపడనున్నది. 

 

Click here for Photogallery

 

 

 

Tags :