ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి.. రూ.1400 కోట్లతో

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి.. రూ.1400 కోట్లతో

దావోస్‌ వేదికగా తెలంగాణకు మరో భారీ పెట్టుబడి దక్కింది. రాష్ట్రంలో రూ.1400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్టు హ్యుందాయ్‌ కంపెనీ ప్రకటించింది. దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన హ్యుందాయ్‌ సీఐఓ యంగ్చోచి ఈ మేరకు ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్‌లో పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. కేవలం పెట్టుబడి పెట్టడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీలో కూడా భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది. ఈ పెట్టుబడితో కంపెనీ టెస్ట్‌ ట్రాక్‌లతో పాటు ఎకో సిస్టమ్‌కు అవసరమైన ఇతర మౌలిక వసతులను కల్పించనున్నట్లు హ్యుందాయ్‌ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వంతో కలిపి పని చేసేందుకు ఉన్న ఇతర అవకాశాలపైనా కూడా కేటీఆర్‌తో యంగోచ్చి చర్చించారు. దేశంలో తొలిసారిగా ప్రత్యేకంగా ఒక మొబిలిటీ వ్యాలిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఇందులో భాగస్వామిగా ఉండేందుకు ముందుకు వచ్చిన హ్యుందాయ్‌కు మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

 

Tags :