ASBL NSL Infratech

ఘనంగా ముగిసిన ఆటా-టాటా మహాసభలు

ఘనంగా ముగిసిన ఆటా-టాటా మహాసభలు

అమెరికా తెలుగు సంఘం (ఆటా), తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టాటా) ఆధ్వర్యంలో డల్లాస్‌లోని ఇర్వింగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఏటీసీ తెలుగు మహాసభ ఉత్సవాలు మూడురోజులపాటు (మే 31-జూన్‌ 2) ఘనంగా జరిగాయి. మూడవ రోజు కార్యక్రమాల్లో మాజీ పార్లమెంట్‌ సభ్యుడు, కేంద్రీయ హిందీ సమితి సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం, వైద్య,వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన సెమినార్లను ప్రత్యేకంగా నిర్వహించారు. సినీ హీరోయిన్‌ త్రిష ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముగింపు వేడుకల్లో దాదాపు 4వేలమంది పాల్గొన్నారు. బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా పేరుతో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన ఆరుగురు విజేతలకు సభల నిర్వాహకులు ప్రోత్సాహక నగదును అందించారు. సినీ రచయిత కోన వెంకట్‌ను ఘనంగా సన్మానించారు. సంగీత దర్శకుడు సాయి కార్తీక్‌ సంగీత విభావరి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. 

ఆటా అధ్యక్షుడు కరుణాకర్‌ అసిరెడ్డి, టాటా అధ్యక్షుడు డా. హరనాథ్‌ పొలిచెర్ల, ఆటా వ్యవస్థాపకుడు హన్మంత్‌ రెడ్డి, టాటా వ్యవస్థాపకుడు డా. పైళ్ళ మల్లారెడ్డి, నాటా వ్యవస్థాపకుడు డా. ప్రేమ్‌ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే (కాంగ్రెస్‌) పద్మావతీ రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Click here for ATC Souvenir 2018

 

Tags :