సీఎం కేసీఆర్కు డొనాల్డ్ ట్రంప్ అభినందన
ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)కు మీ ఆతిథ్యం బాగుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను అభినందించారు. రాష్ట్రపతిభవన్లో నిర్వహించిన విందు సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్తో కరచాలనం చేసి జీఈఎస్ గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సదస్సుకు మీరు హాజరవుతారని భావించాం. ఇవాంక వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు అని పేర్కొన్నట్లు తెలిసింది. సదస్సుకు రావాలని తాను ప్రయత్నించినా సాధ్యం కాలేదని ట్రంప్ సమాధానమిచ్చినట్లు సమాచారం.
Tags :