మహాసభల్లో తెలంగాణ చరిత్రపై సదస్సు
తెలుగు కీర్తిని చాటుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు చివరిరోజుకు చేరుకున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా రవీంద్రభారతి ఆడిటోరియంలో తెలంగాణ చరిత్ర, సంస్థానాలు, ఆసఫ్జాహీల ఆధునికీకరణ, బౌద్ధం, ఆధునిక చరిత్ర తదితర అంశాలపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహమూద్ అలీ పలు పుస్తకాలను ఆవిష్కరించారు.
Tags :