జస్టిస్ రమణకు కేసీఆర్ సన్మానం
మెదక్ జిల్లాలోని ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లిలో అయుత చండీ మహా యాగం రిత్విజుల వేదమంత్రాల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ యాగాశాలకు వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఎన్వీ రమణ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ఎన్వీ రమణకు ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువా కప్పి సన్మానించారు. అమ్మవారి వద్ద నుంచి తెచ్చిన పూలమాల వేసి సత్కరించారు. అమ్మవారి వెండి విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేశారు.
Tags :