పనిచేయని ఇవిఎంలు... రీపోలింగ్ కోసం ఈసీకి బాబు లేఖ
ఈవీఎంలు పనిచేయకపోవడంపై సీఎం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈవీంఎంల పనితీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు ఆందోళన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈవీఎంలు స్తంభించిన ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 శాతం ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదన్ని చంద్రబాబు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈవీఎంలు సరిగా లేక టిడిపికి వేసే ఓట్లు వైఎస్ఆర్సిపికి పడుతున్నాయని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈసీ త్వరగతిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Tags :