కిషన్ రెడ్డిని కలిసిన ఆటా నాయకులు
అట్లాంటాలో జూన్ 7,8,9 తేదీల్లో జరగనున్న అమెరికా తెలుగు సంఘం మహాసభలకు రావాల్సిందిగా కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డిని ఆటా నాయకులు ఆహ్వానించారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఆధ్వర్యంలో ఆటా బృందం కిషన్ రెడ్డిని కలిసి ఆటా మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆటా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, డైరెక్టర్ అనీల్ బొద్దిరెడ్డి తదితరులు కిషన్ రెడ్డిని కలిసినవారిలో ఉన్నారు.
Tags :