ఆటా క్రికెట్ టోర్నమెంట్
ఆటా మహాసభలను పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు. జూన్ 28 నుంచి జూలై 1 వరకు ఈ టోర్నమెంట్ జరగనున్నది. 13 ఏళ్ళలోపు వాళ్ళకు, 17 సంవత్సరాల లోపు వాళ్ళను రెండు కేటగిరీలుగా విభజించుకుని టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిధులుగా కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేలే వస్తున్నారు. హౌజ్ ఆఫ్ వాషింగ్టన్ యూత్ క్రికెట్, హౌవార్డ్ కౌంటీ క్రికెట్ లీగ్, వాషింగ్టన్ మెట్రోపొలిటన్ క్రికెట్ బోర్డ్, వాషింగ్టన్ క్రికెట్ లీగ్, డీసీ హాక్స్ ఇందులో పోటీ పడనున్నాయి.
Tags :