ASBL NSL Infratech

హైదరాబాద్‌లో అపోలో టైర్స్ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్

హైదరాబాద్‌లో అపోలో టైర్స్ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్

తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు అపోలో టైర్స్ లిమిటెడ్ ప్రకటించింది. లండన్ తరువాత తమ రెండవ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ను హైదరాబాద్ లోనే ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపింది. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా కంపెనీ డిజిటల్ వ్యూహాలైన IoT, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (RPA), బ్లాక్ చైన్ వంటి వినూత్న సాంకేతికతలను ఉపయోగించుకుని, కొత్త వ్యాపార నమూనాలను అభివృద్ధి చేయడం, వినియోగదారులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలను కల్పించడంలో ఈ డిజిటల్ ఇన్నోవేషన్ కేంద్రం ప్రధాన పాత్ర పోషిస్తుంది.

దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఐటి,పరిశ్రమలు & వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, అపోలో టైర్స్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్, ఎండి నీరజ్ కన్వర్ లు ఒప్పందం కుదుర్చుకున్నారు. టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్ వంటి ప్రపంచ స్థాయి ప్రమాణాలు గల సంస్థలతో వినూత్న ఆవిష్కరణలకు ఊతం ఇచ్చే ఒక అద్భుతమైన వ్యవస్థ తెలంగాణలో ఏర్పడిందన్న మంత్రి కేటీఆర్... అపోలో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ దీనికి సరైన జోడింపుగా ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లండన్ తరువాత డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్ ను ఎంచుకున్నందుకు నీరజ్ కన్వర్ కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

 

 

Tags :