టైసన్ నాయుడు లేటుకు రీజనేంటి?
టాలీవుడ్ లో తన మార్కెట్ అప్పుడప్పుడే పెరుగుతుందనే టైమ్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగు సినిమాలను వదిలేసి బాలీవుడ్ లో పేరు తెచ్చుకుని అక్కడ సెటిలవుదామనుకున్నాడు. ఆ నేపథ్యంలోనే ఛత్రపతి సినిమాను వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేసి దారుణమైన దెబ్బ తిన్నాడు. ఇప్పుడు మళ్లీ బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు సినిమాలపై దృష్టి పెట్టాడు.
బెల్లంబాబు ఎప్పుడో రెండేళ్ల కిందటే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు అనే సినిమాను మొదలుపెట్టాడు. ఈ సినిమాకు ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతూనే ఉండటంతో సినిమా ఎప్పుడు పూర్తవుతుందనేది చెప్పలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ బ్యానర్ కు బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయని, ఆ రీజన్ తోనే సినిమాకు బ్రేక్స్ పడుతున్నాయంటున్నారు.
ఆ కారణం వల్లే బాలయ్య- బోయపాటి కాంబోలో ప్లాన్ చేసుకున్న ప్రాజెక్ట్ కూడా లేటవుతుందని ప్రచారం జరుగుతుంది. ఆ వార్తలకు బలం చేకూర్చేట్లుగా ఉగాది రోజు మొదలవాల్సిన ఆ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లేదు. రీజన్స్ ఏవైనా సరే శ్రీనివాస్ వీలైనంత త్వరగా ఆ సినిమాను పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఫామ్ కోల్పోయిన శ్రీనివాస్ ఇంకా లేట్ చేస్తే ఈ కాంపిటేషన్ లో తట్టుకోవడం కష్టం.