ASBL NSL Infratech

జగన్ గాయానికి ఉన్న కట్టు పై సునీత కామెంట్స్..

జగన్ గాయానికి ఉన్న కట్టు పై సునీత కామెంట్స్..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. ఎవరో కావాలని రాయితో అతనిపై దాడి చేయించారు అన్న టాక్ నడుస్తోంది.  ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సెల్ ఫోన్ లొకేషన్, కాల్ డేటా ఆధారంతో పాటు సంఘటన స్థలంలో సేకరించిన మూడు రాళ్లపై ఉన్న వేలిముద్రలను ఆధారంగా చేసుకొని దర్యాప్తు సాగిస్తున్నారు. ఇందులో ఏ1గా గుర్తించిన సతీష్ అన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని నెల్లూరు సెంట్రల్ జైల్లో జ్యూడిషియల్ కస్టడీలో ఉంచి విచారిస్తున్నారు. ఇక ఆ విషయం పక్కన పెడితే జగన్ చెల్లెలు సునీత అతనికి సరికొత్త సలహాని అందించింది. తలపై ఇన్ని రోజులు బ్యాండేజ్ ఉంచుకోవడం మంచిది కాదని.. సెప్టిక్ అయ్యే అవకాశం ఉందని ఆమె తెలిపారు. అంతేకాదు ఒక డాక్టర్ గా తనకు ఈ విషయం తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను అని అన్నారు.

బ్యాండేజ్ విషయంలో వైద్యులు జగన్ కు సరియైన సలహా ఇచ్చి ఉండరు.. అందుకే అతను ఇంకా బ్యాండేజ్ వేసుకున్నట్లు ఉన్నారు అని పేర్కొన్నారు. అయితే ఆమె మాట తీరుని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. ప్రతి మనిషికి గాయం నయం అయ్యే విధానం వేరుగా ఉంటుంది అన్న విషయం డాక్టర్ గా ఆమెకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. బహిరంగ సభలలో తిరుగుతున్నారు కాబట్టే.. ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడం కోసం బ్యాండేజ్ వాడుతున్నారు అని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  చెల్లెలు అయ్యుండి ఈ రకంగా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది అని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :